IPL:శ్రేయాస్ అయ్యర్‌కు ఫైన్

6
- Advertisement -

ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి మ్యాచ్‌ గెలిచినా, శ్రేయస్ అయ్యర్ కు జరిమానా తప్పలేదు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు గురైన తొలి కెప్టెన్‌గా అయ్యర్ నిలిచాడు.పంజాబ్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించినప్పటికీ, ఓవర్‌రేట్ నెమ్మదిగా ఉండటంతో అయ్యర్‌పై రూ.12 లక్షల జరిమానా విధించారు. పంజాబ్ జట్టు 20 ఓవర్లు పూర్తి చేయడానికి దాదాపు రెండు గంటలు తీసుకుంది.

చివరి ఓవర్‌కు ముందు సమయం ముగియడంతో, ఫీల్డింగ్ నిబంధనల ప్రకారం ఒక ఫీల్డర్‌ను 30-యార్డ్ సర్కిల్‌లోకి తీసుకురావాల్సి వచ్చింది. దాంతో బౌండరీ వద్ద కేవలం నలుగురు ఫీల్డర్లే ఉండే పరిస్థితి ఏర్పడింది.చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ మొత్తం 11 బంతులు వేశాడు. నాలుగు వైడ్లు, ఒక నో-బాల్ వేయడంతో ఆ ఓవర్‌లో 12 పరుగులు ఇచ్చాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బంతులు వేసిన ఓవర్లలో ఒకటిగా నిలిచింది.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఆరు సార్లు ఒకే ఓవర్‌లో 11 బంతులు వేయబడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అర్ష్‌దీప్ సింగ్ ఈ జాబితాలో చేరాడు.మ్యాచ్ విషయానికి వస్తే, పంజాబ్ కింగ్స్ 163 పరుగుల లక్ష్యాన్ని చివరి ఓవర్‌లో చేరుకుని మూడు వికెట్ల తేడాతో గెలిచింది.కూపర్ కానోలీ 44 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అలాగే ప్రభ్‌సిమ్రన్ సింగ్ 24 బంతుల్లో 37 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు.

ముందుగా బౌలింగ్‌లో విజయ్‌కుమార్ వైశాక్ మరియు యుజ్వేంద్ర చాహల్ కలిసి ఐదు వికెట్లు తీసి గుజరాత్ జట్టును 162 పరుగులకు పరిమితం చేశారు.

Also Read:డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం!

- Advertisement -