బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈకేసులో శిల్పాశెట్టిని కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి శిల్పా కన్నీటి పర్యంతమైంది. గత శుక్రవారం విచారణ నిమిత్తం ఇంటికి వెళ్లగా.. ఆమె పెద్దగా ఏడ్చేసిందని పోలీసు అధికారులు తాజాగా వెల్లడించారు. అంతేగాకుండా భర్త రాజ్ కుంద్రాపై ఆగ్రహంతో అరిచిందని అన్నారు. హాట్ షాట్స్ తో తనకే సంబంధమూ లేదని ఆమె పదే పదే చెప్పారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఆమె.. నీ వల్ల కుటుంబం పరువు పోయిందని, బిజినెస్ దెబ్బ తింటోందని భర్త రాజ్కుంద్రాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అక్కడున్న పోలీసు అధికారి చెప్పారు.విచారణ సందర్భంగా.. తనకే పాపమూ తెలియదంటూ శిల్పకు రాజ్ కుంద్రా చెప్పాడని అధికారులు వివరించారు. అది పోర్న్ కాదని, కేవలం శృంగార చిత్రాలు మాత్రమేనని వివరించే ప్రయత్నం చేశాడన్నారు.కాగా, ఈ కేసుతో శిల్పా శెట్టికి ఎలాంటి సంబంధమూ లేదని అధికారులు స్పష్టం చేశారు. పోర్నోగ్రఫీలో ఆమె పాత్ర లేదన్నారు. కాబట్టి ఇకపై ఆమెను విచారించబోమని చెప్పారు.
అయితే ఇంత జరిగినా శిల్పా శెట్టి మాత్రం తన భర్తను వెనకేసుకొచ్చింది. రాజ్కుంద్రా పోర్న్ వీడియోలు చేయలేదని, కాస్త శృంగారం ఎక్కువగా ఉన్న వీడియోలు తీశాడని ఆమె చెప్పింది. అతడు తీసిన వీడియోల కంటే ఓటీటీల్లో వచ్చే కంటెంట్ దారుణంగా ఉంటోందనీ ఆమె అనడం గమనార్హం.