టీ20 వరల్డ్ కప్‌..జట్టులోకి శార్దూల్

173
shardul
- Advertisement -

ఐసీసీ మినీ వరల్డ్ కప్ టీ 20 అక్టోబర్ 17 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్నిజట్లు టీ 20 వరల్డ్ కప్‌ కోసం సిద్ధం కాగా తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

టీ 20 ప్రపంచ కప్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో ఓ కీలక మార్పు చేసింది. ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో మరో ఆల్‌ రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ ను ఎంపిక చేసింది . అక్షర్‌ పటేల్‌ స్థానాన్ని శార్దూల్‌ ఠాకూర్‌ భర్తీ చేస్తాడని.. అతన్ని మెయిన్‌ టీం లోకి తీసుకుంటున్నట్లు ప్రకటన చేసింది. టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా.. టీమిండియా కొత్త జెర్సీ ని విడుదల చేసింది బీసీసీఐ.

- Advertisement -