రైతులకు క్రీడాకారుల మద్దతు…

176
slaes
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక విధానాలపై రైతులు పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో రేపు మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. రైతుల ఆందోళనలకు దేశంలోని ప్రధాన పార్టీలన్ని మద్దతు తెలపగా తాజాగా పలువురు క్రీడాకారులు మద్దతు ప్రకటించారు.

గతంలో తాము అందుకున్న పురస్కారాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కర్తార్ సింగ్, బాస్కెట్ బాల్ క్రీడాకారులు సజ్జన్‌సింగ్, హాకీ క్రీడాకారుడు రజ్‌బీర్ కౌర్ తదితరులు ఈ నెల 5న రైతుల ఆందోళనలో పాల్గొని, రాష్ట్రపతి భవన్ బయట తమ పురస్కారాలను వదిలిపెట్టాలని నిర్ణయించారు.

రైతులు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి ఐదుగురితో ఒక కమిటీని నియమిస్తామని ప్రభుత్వం మరోసారి చేసిన ప్రతిపాదనను 35 రైతు సంఘాలు మూకుమ్మడిగా తిరస్కరించాయి.

- Advertisement -