వైసిపి నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు..

98
- Advertisement -

తూ.గో.జిల్లా అయినవిల్లి మండల ఎంపీడీఓ కేఆర్‌ .విజయను బెదిరించిన నలుగురు వైసిపి నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు అమలాపురం డి.ఎస్.పి వై.మాధవ రెడ్డి తెలిపారు. ఎంపిడిఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అయినవిల్లి మండల జెడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, ఎన్‌.పెదపాలెం మాజీ సర్పంచ్ వాసంశెట్టి వీరవెంకటతాతారావు, క్రాప శంఖరాయగూడెం మాజీ సర్పంచ్ కుడుపూడి రామకృష్ణ, కె.జగన్నాధపురం గ్రామానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాసరావులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగిందని వై.మాదవరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా వాసంశెట్టి వీరవెంకటతాతారావుని అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మిగతా ముగ్గురిని తమ సిబ్బంది పట్టుకోడానికి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.

- Advertisement -