సవ్యసాచి…సుభద్ర పరిణయం

318
naga chaitanya
- Advertisement -

చందూ మొండేటి, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్ వస్తున్న తాజా చిత్రం “సవ్యసాచి”. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తుంది మూవీ యూనిట్. తాజాగా సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. సుభద్ర పరిణయంతో పేరుతో కామేడీ టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ టీజర్ లో నాగ చైతన్య అర్జునుడిగా, వెన్నెల కిశోర్ శ్రీ కృష్ణుడిగా నటించి కామేడితో ఎంటర్ టైన్ చేశారు.

నాగార్జున నటించిన “అల్లరి అల్లుడు” సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ “నిన్ను రోడ్డు మీద చూసినట్లు లగాయత్తు” అనే రీమేక్ పాటలో అలరించాడు చైతన్య. సవ్యసాచి కోసం మరోసారి ఈ పాటను కీరవాణి రీమేక్ చేశారు. పృధ్వీ చంద్ర, మౌనిమ పాడిన ఈ పాటకు చైతన్య, నిధి అగర్వాల్ స్టెప్పులు వేసి అదరగొట్టారు. నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో హైపర్ ఆది, సుదర్శన్, విధ్యుల్లేఖ రామన్, వైవి హర్ష పలు పాత్రలు పోషించారు.

- Advertisement -