రాహుల్ – చంద్రబాబు భేటీపై వినోద్ ఫైర్

250
MP Vinod Kumar
- Advertisement -

టీడీపీ టికెట్లు ఇంతకముందు హైదరాబాద్‌లో ఇచ్చేవారని కానీ ఇప్పుడు ఢిల్లీలో ఇస్తున్నారని ఎద్దేవా చేశారు ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ ..చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకే కాంగ్రెస్‌తో జత కలిశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను అసెంబ్లీ సీట్లు
అడుక్కునే స్థాయికి చంద్రబాబు దిగజారరని మండిపడ్డారు. రాహుల్‌తో భేటీ తర్వాత చంద్రబాబు ప్రజలకు ఏం చెబుతారని…ఇద్దరి భేటీలో జరిగే ఒప్పందాలను చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించారని కానీ చంద్రబాబు ఆ సిద్దాంతాలకు తిలోదకాలు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలనే కాదు ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోడీతో చంద్రబాబుకు ఎందుకు ఇబ్బందులు వచ్చాయో ఎవరికి తెలియదన్నారు. ప్రజలకు మాత్రం ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని
చెబుతూ టీడీపీ కుహనా రాజకీయాలు చేస్తుందన్నారు.

- Advertisement -