యాదాద్రి ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం..

206
kcr
- Advertisement -

దివంగ‌త క‌ల్నల్ సంతోష్ బాబు స‌తీమణి సంతోషి యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా నియ‌మితుల‌య్యారు. యాదాద్రి జిల్లాకు కేటాయించడంతో ఇవాళ విధుల్లో చేరనున్నారు. భారత, చైనా సరిహద్దుల్లో ఇటీవల ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.

దీంతో ఆ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, స్థలం, రూ.5 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. గతంలోనే ఆమె నియామకానికి సంబంధించిన పత్రాలతో పాటు, స్థల పత్రాలు, రూ. 5 కోట్ల చెక్కును సంతోషికి అందజేశారు.జులై నెలలో ఆమెకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వగా ఇవాళ పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

- Advertisement -