సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా…!

2
- Advertisement -

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు. ఖన్నా పేరును ప్రతిపాదించారు సీజేఐ డీవై చంద్రచూడ్. సుప్రీంకోర్టులో చంద్రచూడ్ తర్వాత సీనియర్ జడ్జిగా ఉన్నారు సంజీవ్ ఖన్నా.

నవంబర్ 10న పదవీ విరమణ పొందనున్నారు డీవై చంద్రచూడ్. చంద్రచూడ్ సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు.

2025 మే 13 వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం ఉండనుంది. 2019లో ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు ఖన్నా.

Also Read:అఖండ 2.. తాండవం

- Advertisement -