సమంత పెప్సీ యాడ్ వైరల్

44
- Advertisement -

సమంత తాజాగా పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌ గా మారింది. దీనికి సంబంధించిన యాడ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో అమ్మాయి పెళ్ళంటే టైమ్ కి అయిపోవాలి అనగానే ..సమంతా టైమ్ ముఖ్యం కాదు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టపడిన వారితో అవ్వాలి అంటూ అమ్మాయిలకు చాలానే మెసేజ్ లు చెప్పింది. అయితే ఈ యాడ్ తో నాగ చైతన్యకు సమంత ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చైతన్య సమంతతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను రోజుకోకటి వింటూనే ఉన్నాం.

ఇక సమంత పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సామ్ బర్త్ డే సీడీపీని మరో స్టార్ హీరోయిన్ తమన్నా సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సీడీపీలో సమంత ఓ కుర్చిలో నవ్వుతూ కూర్చోగా.. ఆమె సాధించిన అవార్డులు, ఆమెపై వచ్చిన వార్తలు పొందుపరచబడ్డాయి. సమంత చిన్నప్పటి, అలాగే సామాజిక సేవకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. సమంత బర్త్ డేకు సంబంధించిన ఈ సీడీపీ నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: ఈ రోజు చిత్రాల పరిస్థితేంటి?

2010 సంవత్సరంలో “ఏ మాయ చేశావే” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత..అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2017లో అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత..2021లో విడిపోవడం జరిగింది. సినిమా రంగంలో తిరుగులేని అవకాశాలు అందుకుంటున్న సమంత..మరోపక్క వెబ్ సిరీస్ లో కూడా సత్తా చాటుతోంది. సామ్ ఇలాంటి మరెన్నో హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మరింతగా అలరించాలని కోరుకుందాం.

Also Read: Filmfare Awards 2023:విజేతలు వీరే

- Advertisement -