7 రోజులు 62 కోట్లు.. మధ్యలో గిఫ్ట్ లు

24
- Advertisement -

సాయి ధరమ్ తేజ్ హీరోగా.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. విడుదలైన 7 రోజుల్లో రూ.62 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. సాయి ధ‌ర‌మ్‌ తేజ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టిన మూవీగా విరూపాక్ష నిలిచింది. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్‌ప్లేను అందించారు. హీరోయిన్ సంయుక్త నటనకు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. దర్శకుడు కార్తీక్ దండుకి కూడా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటికే కార్తీక్ దండుకి పలువురు నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే హీరో మరియు నిర్మాత నుంచి కూడా దర్శకుడు కార్తీక్ దండుకి ఖరీదైన గిఫ్ట్ లు అందబోతున్నాయి అని తెలుస్తోంది. నిర్మాత రెండు రోజుల్లో కారును గిఫ్ట్ గా ఇస్తాడట. మరీ హీరో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి గిఫ్ట్ ను ఇస్తాడో చూడాలి. నిజానికి సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లోనే కార్తీక్ దండు అద్భుతమైన సినిమాని ఇచ్చాడు. మరీ అలాంటి దర్శకుడికి సాయి ధరమ్ తేజ్ ఏమి ఇస్తాడో అంటూ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: సమంత పెప్సీ యాడ్ వైరల్

ఇప్పటికే, ‘విరూపాక్ష’ కథానాయిక సంయుక్త మీనన్ కార్తీక్‌ వర్మ దండుకు సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చింది. ‘విరూపాక్ష’ విడుదల రోజు చిత్ర బృందంతో కలిసి కార్తీక్‌ హైదరాబాద్‌ లోని ఓ థియేటర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ప్రేక్షకులు ఎక్కువగా ఉండటంతో థియేటర్‌ లో కార్తీక్ ఫోన్‌ పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సంయుక్త వెంటనే ఐఫోన్‌ ప్రో మోడల్‌ మొబైల్‌ను కొని దర్శకుడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. త్వరలోనే కార్తీక్, హీరో నిర్మాతల నుంచి కూడా గిఫ్ట్ లను అందుకోబోతున్నాడు.

Also Read: ఈ రోజు చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -