స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

195
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.47,810కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.52,160కు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.48,010కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,370కి చేరింది.

క్రిప్టో కరెన్సీల ధరలు కుప్పకూలడం తో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ రేటు 7.7 శాతానికి పడిపోవడంతో.. ఇక మున్ముందు వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడరల్ రిజర్వు అంత దూకుడుగా వ్యవహరించదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -