క‌రోనా నివార‌ణ‌కు నెల‌జీతం విరాళంగా ఇచ్చిన గ‌వ‌ర్న‌ర్

212
Governor Tamilisai
- Advertisement -

క‌రోనా మ‌హామ్మారి ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 6ల‌క్ష‌ల‌కు పైగా ఈ వ్యాధి సోకింది. క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ నేత‌లు విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ తన ఒక నెల జీతాన్ని కరోనాపై పోరుకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా కరోనా మహ‌మ్మారిపై పోరులో రాష్ట్ర ప్రజలందరికి మద్దతుగా నిలుస్తున్నట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

గవర్నర్ ఒక నెల గౌరవ వేతనం 3 లక్షల 50 వేల ను సీఎం సహాయనిధి అందించింది.అంతకుముందు సీఎస్ తో టెలిఫోన్ లో మాట్లాడిన గవర్నర్ ,ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రం కు వచ్చిన కూలీలకు ఆహారం అందించాలని కోరింది.రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 59 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

- Advertisement -