బోయిన్ ప‌ల్లిలో బైక్ పై తిరిగిన మంత్రి మ‌ల్లారెడ్డి

201
- Advertisement -

క‌రోనా వైరస్ ను నివారించేందుకు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో అవ‌గాహ‌న చేప‌డుతున్నారు. తాజాగా కంటోంన్మెంట్ నియోజ‌క‌వ‌ర్గం బోయిన్ పల్లి లో ద్విచక్రవాహం పై మంత్రి మల్లారెడ్డి బోయిన్ పల్లి మొత్తం తిరిగారు. ఈసంద‌ర్బంగా ప‌లువురు కూర‌గాయ‌ల వ్యాపారులను ధ‌ర‌లు అడిగి తెలుసుకున్నారు. నిత్యావ‌స‌ర స‌రుకులు ఎక్కువ ధ‌ర‌ల‌కు అమ్మితే మీ సాప్ ల లైసెన్స్ ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని మంత్రి మ‌ల్లారెడ్డి హెచ్చ‌రించారు.

ప్ర‌జ‌ల‌ను కూడా అక్క‌డ ఉన్న ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. బైక్ పై వెళ్తూ మాస్క్ వేసు కోని వారికి మాస్క్ లు ధరించాలి అని చెప్తూ నే అత్యవసరముంటే నే బయటకు రావాలని, లేదంటే వాహనాలు సీజ్ చేయడమే కాక చట్టరీత్యా చర్యలు ఉంటాయని ప్రజలకు వివరించారు…ఒక్కరోజే కాదు ప్రతి రోజూ తిరుగుతాను అని మల్లారెడ్డి తనదైన శైలి లో చెప్పారు.

- Advertisement -