సలార్ ఎఫెక్ట్.. స్పిరిట్ వెనక్కి?

20
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సలార్ నాలుగు రోజుల్లోనే రూ.402 కోట్లు కొల్లగొట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి అందరికీ తెలిసేలా చేసింది. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సలార్ దండయాత్ర మరో పది రోజులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మరో వెయ్యి కోట్ల సినిమాగా సలార్ నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే సలార్ పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 పై హైప్ మరింత పెరిగింది. పార్ట్ 1 లో కేవలం క్యారెక్టర్ల పరిచయమే ఉండటంతో అసలు కథ పార్ట్ 2 లోనే ఉండనుంది. దీంతో సలార్ పార్ట్2 పై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. .

ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమాల లైనప్ లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సలార్ తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ 2024 సెప్టెంబర్ నుంచి మొదలౌతుందని సందీప్ రెడ్డి వంగా ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అయితే సలార్ పార్ట్ 1 హిట్ కావడంతో వెంటనే పార్ట్ 2 తెరకెక్కించాలనే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నాడట. దీంతో స్పిరిట్ కంటే ముందే సాలార్ పార్ట్ 2 రూపొందే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కూడా ఓ మూవీ చేయాల్సి వుంది. సలార్ పార్ట్ 2 ముందుకొస్తే.. ఎన్టీఆర్ తో చేయబోయే మూవీ కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. మొత్తానికి సలార్ పార్ట్ 1 హిట్ కావడంతో ప్రభాస్ స్పిరిట్, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ రెండు కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్.

Also Read:అఫ్గాన్ టూర్ లో కెప్టెన్ ఎవరు ?

- Advertisement -