విలీన గ్రామాల్లో సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలి- సీఎం

264
kcr cm
- Advertisement -

మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని, సంబంధిత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు.

శనివారం జనగామా జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ కార్పోరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని విలీన గ్రామాల్లో సాదాబైనామాలతో జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి హామీ ఇచ్చారు.

- Advertisement -