రెండో రోజు రైతుబంధు రూ.1218.38 కోట్లు..

16
- Advertisement -

రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు బంధు రెండోరోజుకు చేరింది. ఇవాళ రూ.1218.38 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. 24 లక్షల 36 వేల 775.07 ఎకరాలకు గాను రూ.1218 కోట్ల 38 లక్షల 75,934 లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.

వ్యవసాయ వృద్ది కొరకే రైతుబంధు పథకం అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, సాగునీరు, మిషన్ కాకతీయ, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల పథకాలతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. విత్తనాల కోసం లైన్లలో నిలబడి, ఎరువుల కోసం లాఠీదెబ్బలు తిన్న గత పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేదు అన్నారు. ప్రభుత్వ చర్యల మూలంగా ఎనిమిదేళ్లలో తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో, పత్తి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశమంతా అమలు జరగాలని భారత రైతాంగం డిమాండ్ చేస్తుందని…దేశంలో కేసీఆర్ గురించి, తెలంగాణ పథకాల గురించి మాట్లాడుకోవడం మొదలయిందన్నారు. కేంద్రంలో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని…అబ్ కి బార్ .. కిసాన్ సర్కార్ నినాదంతో బీజేపీకి చెమటలు పడుతున్నాయన్నారు. అందుకే తెలంగాణ అభివృద్దికి అడ్డుపడుతూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -