నిఖత్,ఇషాలకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు

134
- Advertisement -

జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్‌ లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో నిఖత్ జరీన్, ఇషా సింగ్‌ లు ఎమ్మెల్సీ కవితను కలిశారు.

జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ బంగారు పతకం గెలుపొందడం ,జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ రజత పతకం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత, వీరిద్దరి విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు.

- Advertisement -