అందుకే అన్‌స్టాపబుల్‌ షోకి ప్యాకేజీ పవన్‌!

24
- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ వేదిక కాగా త్వరలోనే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ షో కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా సంచలన కామెంట్స్ చేశారు నటి రోజా.

అన్ స్టాపబుల్ షోకి పవన్ హాజరుకావడంపై తనదైన శైలీలో కామెంట్స్ చేశారు. ఈ షోకి తొలుత చంద్రబాబు హాజరయ్యాడని, ఆ తర్వాత ప్యాకేజి తీసుకుని పవన్ కల్యాణ్ కూడా షోకి హాజరయ్యాడని విమర్శించారు.

ప్యాకేజి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి పవన్ కల్యాణ్ అని …అలగా జనం, సంకర జాతి జనం అంటూ దూషించిన బాలకృష్ణ, హోస్ట్ గా వ్యవహరించే షోకి హాజరుకావడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యకర్తలతో టీడీపీ, బీజేపీ జెండాలు మోయిస్తున్నాడని, జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచించాలన్నారు. మరి దీనిపై జనసైనికులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి..

ఇవి కూడా చదవండి..

- Advertisement -