రాజ‌మౌళికి షాక్…’ఆర్ఆర్ఆర్’ ట్రైయ‌ల్ షూట్ క్యాన్స‌ల్

165
rrr
- Advertisement -

ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మ‌రో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈమూవీ మేజ‌ర్ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కార‌ణంగా ఈమూవీ షూటింగ్ వాయిదా ప‌డింది. ఇటివ‌లే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ లో సడ‌‌లింపులు ఇవ్వ‌డంతో తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు. అయితే లాక్ డౌన్ తర్వాత మ‌ళ్లీ ఆర్టీస్టుల డేట్లు మ‌ళ్లీ అడ్డస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు ఈ సినిమా కోసం ప్లాన్ చేసుకున్న షెడ్యూల్‌తో పాటు లొకేషన్స్ అన్ని మారిపోయాయి. తెలంగాణ‌తో పాటు ఏపీలో కూడా సినిమా షూటింగ్ ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో లోకేష‌న్ల‌ను చేంజ్ చేశార‌ని స‌మాచారం. అయితే ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ డూప్ ల‌తో షూటింగ్ చేయ‌డానికి సిద్ద‌మ‌య్యాడు రాజ‌మౌళి. ఇందుకు లోకేష‌న్ల‌ను కూడా సిద్దం చేసుకున్నాడు. షూటింగ్ కు అన్ని సిద్దం చేసుకున్నాక పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని స‌మాచారం.

దీంతో ‌రాజ‌మౌళి డిస‌ప్పాంయింట్ అయ్యాడ‌ని తెలుస్తుంది. పోలీసుల అనుమ‌తి వ‌చ్చిన త‌ర్వాతే షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈమూవీని 2021జ‌న‌వ‌రిలో విడుద‌ల చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గ‌తంలో ప్ర‌క‌టించాడు. అయితే లాక్ డౌన్ కార‌ణంగా 2నెల‌లు షూటింగ్ ఆగిపోవ‌డంతో మ‌రో 2నెల‌లు ఆల‌స్యంగా సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -