ముగిసిన రిషి అంత్యక్రియలు..

297
rishi kapoor
- Advertisement -

బాలీవుడు నటుడు, సీనియర్ హీరో రిషి కపూర్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది రిషి ఫ్యామిలీ. కరోనా నేపథ్యంలో అభిమానులు,సన్నిహితులు ఎవరు అంత్యక్రియలు హాజరుకావొద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేయడంతో కొద్దిమంది మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు.

ముంబైలోని చందావాడీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు ముగియగా రిషికపూర్ భార్య నీతూ కపూర్, కొడుకు రణబీర్ కపూర్, సోదరుడు రణధీర్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, అలియా భట్‌లతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

రెండేళ్లుగా లుకేమియా‌తో బాధపడుతున్న రిషీకపూర్ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. అమెరికాలో కేన్సర్ చికిత్స పూర్తి చేసుకుని గతేడాది సెప్టెంబర్‌లోనే రిషీ భారత్‌కు తిరిగి వచ్చారు. అయితే చికిత్స తీసుకుంటుండగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు.

- Advertisement -