నటిగా రీ ఎంట్రీ ఇవ్వనున్న రేణు దేశాయ్..

247
Renu Desai
- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణ దేశాయ్ నటిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటిచింది. చాలా ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు రావడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. వచ్చే నెలలో ఈ వెబ్ సిరీస్ ప్రారంభించబోతున్నట్టు రేణు ప్రకటించింది. ఇక రేణు దేశాయ్ చేయబోయే ఈ వెబ్ సిరీస్ న్యాయం కోసం పోరాడే ఓ యువతి కథ అని చెప్పుకొచ్చింది.

త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు చెప్తాను. స‌త్యాన్వేష‌ణ‌లో ఉన్న ఓ మ‌హిళ ప్ర‌యాణానికి మీ ఆశీస్సులు, ప్రేమ‌ను అందించాల‌ని కోరుకుంటున్నా’అని రేణూ ఇన్‌స్టా పోస్టులో వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్‌ను సాయికృష్ణ ప్రొడక్షన్స్ పై డీఎస్ రావు, ఎస్.రజినీకాంత్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఎం.ఆర్.కృష్ణ మామిడాల ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నట్టు రేణు చెప్పింది.

- Advertisement -