మామ‌య్య చెబితే ప్ర‌చారం చేస్తాః తేజ్

307
pawan, tej
- Advertisement -

 మామ‌య్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబితే నేను ఏపనినైనా చేస్తాన‌ని చెప్పారు సుప్రీయ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్.. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌చారం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపుమేర‌కు వేచి చూస్తున్నాన‌ని తెలిపారు. తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గోనేందుకు హీరోయిన్ కేథ‌రిన్ తో క‌లిసి వ‌చ్చారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

tej

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట త‌న‌కు ఓ ఆదేశం వంటిద‌న, ఆయ‌న చెబితే జ‌న‌సేన నుండి ప్ర‌చారం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని తెలిపారు. ఆయ‌న అనుమ‌తి కోసం నేను ఎదురుచూస్తున్నాన‌ని తెలిపారు. సిన‌మాల్లో ఏలాగైతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెం1 స్దాయికి చేరుకున్నాడో రాజ‌కీయాల్లో కూడా ప‌వ‌న్ అలాగే ఉన్న‌త స్దాయి కి చేరుకుంటాడ‌ని నాకు న‌మ్మ‌కం ఉంద‌న్నారు తేజ్. ఇటివ‌లే తాను న‌టించిన సినిమా తేజ్ ఐల‌వ్ యూ చిత్రం ఈనెల 29వ తేదిన విడుద‌ల అవుతున్నట్లు తెలిపారు. ఈచిత్రంతో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎలాగైనా హిట్ సాధింస్తుంద‌నే గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు.

, tej

వ‌రుస ప్లాప్ ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తేజ్ ఈసినిమాపై భారీ అంచానాలు పెట్టుకున్నాడు. ప్రేమ‌క‌థ‌ల‌ను తెర‌కెక్కించ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన క‌రుణాక‌ర‌ణ్ ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్ గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించింది. త‌న త‌రువాతి సినిమాను కూడా ప్రారంభించిన‌ట్టు తెల‌పారు సాయి ధ‌ర‌మ్ తేజ్. వ‌రుస ప్లాప్ ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తేజ్ ఈసినిమాతో అయిన స‌క్సెస్ సాధిస్తాడో లేదో చూడాలి.

- Advertisement -