ఎన్నారైగా.. ఇడియట్‌..?

205
- Advertisement -

‘టచ్ చేసి చూడు’ అంటూ సవాల్‌ విసురుతున్న మాస్‌రాజా రవితేజా ఫుల్‌ బిజీ అవడానికి ప్లాన్‌చేస్తున్నట్టున్నాడు. ఫిబ్రవరి 2వ తేదీన ‘టచ్ చేసి చూడు’ ఆడియెన్స్‌ మందుకు రానుంది. రాశీఖన్నా, శీరత్‌ కపూర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని విక్రమ్ సిరికొండ తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమా తర్వాత ఈ ‘ఇడియట్‌’ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయడానికి కమిట్‌ అయ్యడని టాక్‌. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి కూడా రెడీ అవుతోంది.

 Ravi Teja Plays NRI in Director Sreenu Vaitla film

ఇక కల్యాణ్‌ మూవీ తర్వాత శ్రీను వైట్లతో రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ ఎన్నారైగా కనిపించనున్నాడని తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలను మేళవిస్తూనే ఈ ఎన్నారై పాత్రను శ్రీను వైట్ల డిజైన్ చేశాడని చెబుతున్నారు.

కొంతభాగం హైదరాబాద్ లో .. మరికొంత భాగం విదేశాల్లో చిత్రీకరించనున్నారట. కాగా.. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -