చేవెళ్లలో కొండా ఓటమి..రంజిత్ రెడ్డి గెలుపు

260
konda
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటింది టీఆర్ఎస్. మొత్తం 17 పార్లమెంట్ స్ధానాల్లో 9 స్ధానాల్లో విజయబావుటా ఎగురవేసింది. ఇక ప్రారంభం నుంచి హోరాహోరిగా సాగిన చేవెళ్ల పోరులో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటమిపాలయ్యారు. కొండాపై టీఆర్ఎస్ అభ్యర్ధి రంజిత్ రెడ్డి ఘన విజయం సాధించారు.

మెదక్ నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి,మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత,వరంగల్ నుంచి పసునూరి దయాకర్,జహీరాబాద్ నుంచి బీబీ పాటీల్,నాగర్ కర్నూల్ నుంచి పి రాములు,మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి,ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరా వు విజయం సాధించారు. కాంగ్రెస్ 3 స్ధానాల్లో గెలుపొందగా బీజేపీ 4,ఎంఐఎం ఒక చోట విజయం సాధించింది.

- Advertisement -