ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓటీటీ వెబ్ సిరీస్ రానా నాయుడు స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్ సక్సెస్ సాధించగా తండ్రి-కొడుకుల మధ్య పగ మరింత ఘర్షణాత్మకంగా, బోల్డ్గా, ఇన్టెన్స్గా మళ్లీ తెరపైకి వచ్చింది.
రానా దాగుబాటి మరియు వెంకటేష్ దాగుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ డ్రామా సిరీస్ ఇప్పుడు మరింత బలంగా, భావోద్వేగంగా మరియు ఆక్షన్తో నిండిన కథనంతో ముందుకు సాగుతోంది.
ఈ సీజన్లో కొత్తగా 8 ఎపిసోడ్లు ఉండగా, ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ భాషలలో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది . కరణ్ అంషుమన్ మరియు సుపర్న్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అత్యంత బోల్డ్ గా ఉండటంతో ప్రేక్షకులను తాజా సీజన్ ఆకట్టుకుందా లేదా వేచిచూడాలి.
Also Read:3 గంటలు గాల్లోనే..ప్రయాణీకుల ఆందోళన!

