డ్రగ్స్ కేసు…విచారణకు హాజరైన రానా

107
rana
- Advertisement -

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో నేడు ఈడీ విచారణ కు హాజరయ్యారు హీరో దగ్గుబాటి రానా. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈడీ ముందుకు రానున్నాడు హీరో రానా. ఇక ఇప్పటికే ఈ కేసులో నలుగురిని విచారించిన అధికారులు…ఇవాళ రానాను ప్రశ్నలు కురిపించనున్నారు.

డ్రగ్స్ వ్యవహారం, మనిలాండరింగ్ వ్యవహారం పై హీరో రానాను ప్రశ్నించునున్నారు ఈడీ అధికారులు. ఇక నిన్న సుదీర్ఘంగా నటుడు నందు తో పాటు కెల్విన్, ఖుద్దుస్, వాహిద్ లను విచారణ చేశారు ఈడీ అధికారులు.

ఎఫ్ కేఫ్ లాంజ్ ను సెంటర్‌గా చేసుకున్న కెల్విన్.. సినీ తారలకు అక్కడే డ్రగ్స్‌ సప్లై చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, ఎఫ్‌ కేఫ్ లాంజ్‌లో డ్రగ్స్ పార్టీలపై 2017లో దృష్టి సారించింది ఎక్సైజ్ శాఖ.. ఎఫ్ కేఫ్ లాంజ్ పార్టీల ఆధారంగా 2017లో తెర మీదకు టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వచ్చింది.. అదే ఎఫ్ కేఫ్ లాంజ్ వేదికగా జరిగిన డ్రగ్స్ పార్టీ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.. డ్రగ్స్ పార్టీలో మత్తు కోసం జరిగిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది..

- Advertisement -