రామోజీరావు..ప్రస్థానం ఇదే

10
- Advertisement -

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(87) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఇవాళ ఉదయం 04 : 50 గంటలకు తుదిశ్వాస విడిచారు. తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాల్లో తనదైన ముద్రవేశారు రామోజీ రావు. అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు జరగనున్నాయి.

కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్‌16న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు రాజ్యలక్ష్మీ, రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు.

1947లో గుడివాడ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరి 1951 వరకు సిక్త్స్‌ ఫాం వరకు చదివారు. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్‌, బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం దిల్లీలోని ఓ యాడ్‌ ఏజన్సీలో ఆర్టిస్ట్‌గా చేరారు. 1961లో తాతినేని రమాదేవితో వివాహం జరుగగా 1962లో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
1962 అక్టోబరులో మార్గదర్శి చిట్‌ఫండ్‌ స్థాపించారు. 1965లో కిరణ్‌ యాడ్స్‌ ప్రారంభించారు. 1967-1969 వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్‌ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు.

1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. 1970లో ఇమేజస్‌ అవుట్‌డోర్‌ అడ్వర్టయిజింగ్‌ ఏజన్సీ ప్రారంభించారు. 1972-1973 విశాఖలో డాల్ఫిన్‌ హోటల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 21.06.1980లో త్రీస్టార్‌ హోటల్‌గా డాల్ఫిన్‌ ప్రారంభంకాగా 1974లో విశాఖ ‘ఈనాడు’ దిన పత్రిక ప్రారంభమైంది. 1974లో మార్గదర్శి మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభం కాగా 1975 డిసెంబరు 17న ఈనాడు హైదరాబాదు ఎడిషన్‌ ప్రారంభమైంది.1976లో సినీ ప్రేమికుల కోసం సితార పత్రికను ప్రారంభించగా 1978లో చతుర , విపుల మాస పత్రికలు ప్రారంభమయ్యాయి. 1980లో ప్రియా ఫుడ్స్‌,1983లో ఉషాకిరణ్ మూవీస్‌ని ప్రారంభించారు. 1990లో ‘ఈనాడు జర్నలిజం స్కూలు’,1996లో ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ స్థాపించారు.2002లో ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతీయ ఛానళ్లు, 2002లో ‘రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌’ ప్రారంభమైంది. 2014లో ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా నామినేట్ అయ్యారు.

Also Read:ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

- Advertisement -