తిరుమల శ్రీవారి సన్నిధిలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌

168
ramnath kovind
- Advertisement -

తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు రామ్‌ నాథ్‌. ఉదయం 10.30 గంటలకు రామ్‌ నాథ్‌ తిరుమలకు చేరుకోనుండగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తొలుత తిరుచానూరు పద్మావతి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం ఒంటి గంట 05 నిమిషాలకు వరాహస్వామిని తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. ఒంటి గంటల 55 నిమిషాలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు తిరిగి రేణిగుంట చేరుకొని అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తారు.

- Advertisement -