దేశంలో 92 లక్షలకు చేరువలో కరోనా కేసులు

180
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంట‌ల్లో 37,975 క‌రోనా కేసులు న‌మోదుకాగా 480 మంది మృతిచెందారు. దీంతో దేశంలో క‌రోనా కేసులు సంఖ్య 91,77,841కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,38,667 యాక్టివ్ కేసులుండగా 86,04,955 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1,34,218 మంది మ‌ర‌ణించారు.

దేశంలో కరోనా రికవరీ రేటు 93.75 శాతంగా ఉండగా గత 24 గంటల్లో 10.9 ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

- Advertisement -