రామ్ చరణ్ మంచు మనోజ్ మల్టీస్టారర్!

344
Manchu Manoj Ram Charan
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మంచు మనోజ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి, మోహన్‌బాబు కలిసి నటించిన హిట్ చిత్రం రంగా బిల్లా రీమేక్‌లో కలిసి నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి పాత్రలో రామ్ చరణ్, మోహన్ బాబు పాత్రలో మంచు మనోజ్ నటిస్తారని ఫిలిం నగర్ వర్గాల టాక్. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తన తర్వాతి మూవీపై ఎటువంటి క్లారిటి ఇవ్వలేదు. ఇక మనోజ్ గత మూడు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇటివలే అహంబ్రహ్మాస్మి అనే సినిమాను ప్రారంభించాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈసినిమాను మంచు ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

- Advertisement -