ఈనెల 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

366
koil alwar
- Advertisement -

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 23 నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 20న శుక్రవారం రోజున కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. మార్చి 22న అంకురార్పణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.

మార్చి 20న ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

- Advertisement -