గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి..

281
Ramavath Valya Nayak
- Advertisement -

తన జన్మదిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపుమేరకు రాష్ట్ర కార్యదర్శి రామవత్ వల్యాణయక్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణను హరిత మయం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించి తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం విరివిగా మొక్కలు నాటేలా చైతన్యం తీసుకొస్తున్నారు, ఎంపీ సంతోష్ కుమార్ కృషి అభినందనీయం అన్నారు.

గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాడటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపును ఇచ్చారు. ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం ద్వారా యావత్ తెలంగాణ, యావత్ భారత దేశం పచ్చదనంగా మారాలని, సంతోష్ కుమార్ కన్న కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -