తెలంగాణను దోచుకునేందుకే కొత్తపార్టీలు: గుత్తా

271
gutha
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని….దుర్భుద్ధితో తెలంగాణ ను దోచుకునేందుకు కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.ఎవరి హయాంలో అయితే హైదరాబాద్ లో అల్లాకొల్లలం చేసి ఫ్యాక్షన్ రాజకీయాలను తెచ్చారో వారే ఇవ్వాళ పార్టీ స్థాపిస్తాం అంటూ నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారన్నారు.

సుస్థిర ప్రభుత్వం న్నీ బలహీన పరచేందుకే కొన్ని శక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి….ఆశకు కూడా హద్దు ఉంటుంది…..తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు…. రాజకీయ లబ్ది పొందాలని చుస్తే వల్ల పప్పులు ఇక్కడ ఉడకవు…….తెలంగాణ లో గడీల పాలన లేదు.. ప్రజాస్వామ్య యుతంగా పాలన సాగుతుందన్నారు.

కులాల పేరుతో మతాల పేరుతో , ప్రజలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని కొన్ని శక్తులు గోతి కాడి నక్కలగా చూస్తున్నాయి…. తస్మాత్ జాగ్రత్త…ప్రజలంతా జాగురుకతతో ఉండాలి……….తెలంగాణ ను అస్థిర పరిచే శక్తులకు ఇక్కడ స్థానం లేదు… అవకాశం ఇవ్వకూడదన్నారు.వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి… వివిధ వ్యవసాయ పథకాలు అవసరాల కోసం 15వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు…

అందుకే దేశంలో తెలంగాణ రాష్ట్ర మే అభవృద్ధి లో ముందు ఉందన్నారు.పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా నీటి దోపిడీ చేసింది ఎవరు…?మళ్లీ తెలంగాణ ప్రజల మధ్య బేధాభిప్రాయాలు, అలజడి సృష్టించాలనే మీ పన్నాగాలు ఇక పారవు…..తెలంగాణ ప్రజలు తెలివి కలవాల్లు.. మీ కుట్రలు కుతంత్రాలు తిప్పి కొడతారు…రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్.. కొత్త బిచ్చగాడు..నేను కాంట్రాక్టర్ ను కాను… అభివృద్ధి కోరుకునే వాన్ని..అందరి మనిషిని….పెయింటింగ్ పని చేసుకునే రేవంత్ రెడ్డి ఈరోజు రేంజ్ రోవర్ కారులో తిరుగుతున్నాడు…దోచుకొని దాచుకునే చరిత్ర వారిది…నల్లగొండ జిల్లా ప్రజలకు తెలుసు గుత్తా అంటే ఏమిటో …. గుత్తా అంటే అభివృద్ధి కోసం పాటు పడే నాయకుడు….నాకు ఎవ్వరి సర్టిఫికెట్ అవసరం లేదు …నీతులు మాట్లాడే రేవంత్ పార్టీలు ఎందుకు మారిండో చెప్పాలన్నారు.

- Advertisement -