RC15 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..

102
- Advertisement -

టాలీవుడ్‌ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, తమిళ డైరెక్టర్‌ శంకర్ కాంబోలో ఓ భారీ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్నఈ మూవీ షూటింగ్ శుక్రవారం పూనేలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చెర్రీ, కియారా అద్వానీపై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఈ చిత్రాన్నిదిల్ రాజు ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో ఆసక్తికరమైన కథతో రూపొందుతోంది. చరణ్‌కు ఇది 15వ చిత్రం కాగా.. దిల్ రాజు బ్యానర్‌లో ఇది 50వ చిత్రం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, మలయాళ స్టార్ జయరాం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -