గణతంత్ర వేడుకల్లో బాలయ్య,చరణ్

108
balakrishna
- Advertisement -

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పలువురు సినీ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో రిపబ్లిక్ డే వేడుకల్ని జరిపారు. జెండా ఎగురవేసి ఆ తర్వాత ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళులు అర్పించారు. అంద‌రికి గణతంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అరవింద్ కలిసి 73వ గణతంత్ర దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకొని చిరంజీవి చారిట‌బుల్ ట్రస్ట్ కార్యాల‌యంలో త్రివ‌ర్ణ‌ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అంద‌రికి గణతంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్బంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ర‌క్త‌దానం చేస్తున్న ప్ర‌తిఒక్క‌రిని ప‌లక‌రించారు.

- Advertisement -