19న రాజ్యసభ ఎన్నికలు..

279
rs elections
- Advertisement -

ఈ నెల 19న 24 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది ఎన్నికల సంఘం. 10 రాష్ట్రాల్లో కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానాలు 18 ఉండగా మిగిలిన ఆరు తాజా స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

షెడ్యూల్ ప్రకారం మార్చి 26న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. వీటిలో 37 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇక ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్‌లో 4,గుజరాత్‌లో 4, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల నుంచి మూడు స్థానాల చొప్పున, జార్ఖండ్‌ నుంచి రెండు, మణిపూర్‌, మేఘాలయల్లో ఒక్కో స్థానానికి తాజాగా ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు తాజాగా కర్ణాటక (4), అరుణాచల్‌ప్రదేశ్‌ (1), మిజోరం (1)లలోని ఆరు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.

- Advertisement -