రాజశేఖర్ అందుకే ఒప్పుకున్నాడట

45
- Advertisement -

ఇప్పటి వరకు హీరో పాత్రలు చేస్తూ వచ్చిన హీరో రాజశేఖర్ తొలిసారిగా పూర్తి స్థాయి విలన్ పాత్ర చేస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా’. ఆర్డినరీ మ్యాన్. నితిన్ హీరోగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాను ఒప్పుకోవడానికి కారణాన్ని చెప్పాడు రాజశేఖర్. ఎందుకు గతంలో వచ్చిన స్టార్ హీరో సినిమాలను కాదు అనుకుని, నితిన్ సినిమాని ఒప్పుకున్నారు ? అని అడిగితే.. రాజశేఖర్ అంతే ఓపెన్ గా సమాధానం చెప్పాడు. ఈ సినిమాలో నితిన్ హీరో కాదు, నేను విలన్ కాదు. రెండు పాత్రల మధ్య జరిగే డ్రామా ఈ సినిమా. అందుకే, ఈ సినిమా చేస్తున్నా’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.

అలాగే, రాజశేఖర్ తన పాత్ర గురించి చెబుతూ ‘’ఎక్స్ట్రా’. ఆర్డినరీ మ్యాన్ లో నాది ఫుల్ లెంగ్త్ నెగిటివ్ పాత్ర. అలా అని ఆ పాత్ర మోటుగా రేపులు, స్మగ్లింగ్, ల్యాండ్ మాఫియాలా కాకుండా స్టైలిష్ గా ఉంటుంది. బాగా పంతం ఉన్న వ్యక్తి. నువ్వొక దెబ్బ కొడితే నేనొక దెబ్బ కొడతా అనే టైపు పాత్ర. చెప్పాలంటే ‘డీ అంటే డీ’ అనే పాత్ర. దర్శకుడు వక్కంతం వంశీ నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశాడు. నిజానికి నితిన్ పాత్ర కంటే కూడా, నా పాత్రనే బలంగా ఉంటుంది. ఒక నటుడిగా నేను ఈ సినిమాని నాకు పునర్జన్మలా ఫీలవుతున్నాను అని రాజశేఖర్ ఎమోషనల్ అయ్యాడు.

రాజశేఖర్ తన సినీ కెరీర్ గురించి కూడా మాట్లాడుతూ.. ‘గతంలో నేను కొన్ని చెడ్డ సినిమాలు చేశాను. ఆ సినిమాలు ఎప్పుడు విడుదలయ్యి వేల్లిపోతున్నాయో కూడా నాకు అర్ధం అయ్యేది కాదు. అందుకే, నా సినిమాల విషయంలో కేర్ తీసుకోవాలనుకున్నాను. ఈ క్రమంలోనే నేను నితిన్ ‘ఎక్స్ట్రా’. ఆర్డినరీ మ్యాన్ సినిమా చేస్తున్నా. నాకు నితిన్ అంటే ఇష్టం, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అలాగే ఒక మంచి బ్యానర్ లో, ఓ మంచి దర్శకుడితో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తాను అంటూ రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.

Also Read:ముంబై బాట పట్టిన మరో భామ

- Advertisement -