2023లో రాజమౌళి-మహేశ్ మూవీ!

49
rajamouli
- Advertisement -

ఆర్ఆర్ఆర్‌తో సూపర్ హిట్ కొట్టిన రాజమౌళి తన తర్వాత ప్రాజెక్టును మహేశ్‌ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమాను రాజమౌళి 2023లో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సినిమాలో మహేష్‌ లుక్ భిన్నంగా ఉండనుందట. ఇప్పటికే ఈ సినిమా కోసం టెక్నీషియన్స్‌ ఫైనల్‌ కాగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రారంభించేలోపు త్రివిక్రమ్‌తో సినిమాను కంప్లీట్ చేయనున్నాడు మహేశ్. వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -