ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు..

35
- Advertisement -

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని.. రెండు రోజుల్లో వీటిపై సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.

ఈనెల 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని విమర్శించారు. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని.. పోలీసులు జైలుకు పంపినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

ఇప్పటికే ఓ మతానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైల్లో సైతం ఉండి వచ్చారు రాజాసింగ్. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సైతం ఆయన్ని సస్పెండ్ చేసింది. తర్వాత ఆ సస్పెన్షన్ ఎత్తివేయగా తాజాగా మరోసారి పోలీసుల నోటీసులు అందుకున్నారు రాజాసింగ్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -