ముసలవ్వకు చెప్పులు తొడిగిన రాహుల్‌

266
- Advertisement -

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ యాత్ర తెలంగాణలో కొనసాగుతున్న వేళ ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాహుల్‌ చేపట్టిన యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున్న పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. అయితే తాజాగా ఒక ముసలవ్వ రాహుల్‌ కలిసేందుకు రాగా… జనం మధ్యలో ఆ ముసలవ్వ తోపులాటకు గురైంది.

దీంతో అస్వస్థతకు గురైన ముసలవ్వను గమనించిన రాహుల్‌…ముసలవ్వను లేపి నీళ్లు అందించి… సపర్యలు చేశారు. అనంతరం ముసలవ్వకు చెప్పులను స్వయంగా తొడిగారు. రాహుల్‌ గాంధీ చేసిన సపర్యలకు ముసలవ్వ చేతులెత్తి మొక్కింది. అనంతరం కాసేపు రాహుల్‌తో కలిసి ఈ యాత్రలో ముందుకు సాగింది. భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ ఈ రోజు రాత్రి రుద్రారమ్‌ గణేష్‌ మందిర్‌లో బస చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

జోడో జోష్..రాహుల్‌తో బాలీవుడ్ నటి

తెలంగాణపై కేంద్రం కుట్ర

మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం:ఈసీ

 

 

- Advertisement -