కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు..

113
Rahul-Gandhi
- Advertisement -

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ పార్టీ బాధితురాలిగా దేశాన్ని మార్చవద్దని ఆయన కోరారు. కోవిడ్ వ్యాక్సిన్లపై ఇప్పటి వరకు జరిగిన చర్చ చాలని… దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను పూర్తిగా ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కరోనా రహితంగా మార్చడానికి ఈ పని చేయాల్సిందేనని చెప్పారు. ఇక వ్యాక్సిన్ ధరలకు రెక్కలు వచ్చిన తరుణంలో రాహుల్ గాంధీ స్పందించారు. అదేవిధంగా కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం వల్ల తీవ్రంగా బాధపడుతున్న ప్రజలకు అండగా ఉండాలని రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను కోరారు. రాజకీయ పనులు పక్కనబెట్టి, ప్రజలకు సేవ చేయాలని కోరారు. వ్యవస్థ విఫలమైనందువల్ల ప్రజలకు సాయపడాలన్నారు.

కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ లు వాటి ధరలను అమాంతం పెంచేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను రూ. 600, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400కు ఇవ్వనున్నట్టు సీరమ్ ప్రకటించింది. భారత్ బయోటెక్ విషయానికి వస్తే.. కోవాగ్జిన్ ను రాష్ట్ర ప్రభుత్వాలను రూ. 600కు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 1,200కు ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి మాత్రం రూ. 150కే ఇస్తామని తెలిపింది.

- Advertisement -