వ్యాక్సినేషన్‌లో సమస్యలు రాకుండా చూడాలి- మంత్రి

128
Satyavathi Rathod
- Advertisement -

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కరోనా పరిస్థితుల గురించి మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరా తీశారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ను రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించాలని చెప్పారు.

అత్యవసర మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడిపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6,551 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ కరోనా కట్టడికి తగు చర్యలు చేపడుతోంది.

- Advertisement -