ఎంపీగా రాహుల్ నామినేషన్..

9
- Advertisement -

వయనాడ్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గత సార్వత్రిక ఎన్నికల్లో 4.31 లక్షల ఓట్లతో గెలుపొందారు రాహుల్. ఈసారి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

రాహుల్ ప్రత్యర్థిగా సీపీఐ ఈసారి ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి అన్నీరాజాను బరిలోకి దించింది. బీజేపీ త‌ర‌పున ఆ పార్టీ కేర‌ళ అధ్య‌క్షుడు కే సురేంద్ర‌న్ పోటీ చేస్తున్నారు.సెకండ్ ఫేజ్‌లో కేరళ ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.దశాబ్దాలుగా రాహుల్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన అమేథీని వదులుకుని మరీ ఈసారి వయనాడ్ నుండి పోటీచేస్తున్నారు రాహుల్.

Also Read:ఆ రెండు చోట్ల ఉప ఎన్నికలు?

- Advertisement -