ఎంతమంది రైతులు ప్రాణత్యాగం చేయాలి: రాహుల్

150
rahul
- Advertisement -

రైతు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు ఎంతమంది రైతులు ప్రాణత్యాగం చేయాలని కేంద్రాన్ని ప్రశ్నించారు ఎంపీ రాహుల్ గాంధీ. రైతులు చేస్తున్న ఆందోళన ఇప్పటికి 17రోజులు అయ్యాయి. కానీ కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదని రాహుల్ విమర్శించారు. రైతన్నల కన్నీరు రుచి చూసినవారు ఎలా నాయకులవుతారు, రాజ్యానికి రైతే రాజు, రైతులేనిదే రాజ్యం లేదని మండిపడ్డారు.

కేంద్రం అమలులోకి తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతులు 17 రోజులుగా నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులతో పలు మార్లు చర్చలు జరిపిన కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలో స్పందించిన రాహుల్..కేంద్రం తీరును తప్పుబట్టారు.

- Advertisement -