12 శాతం తగ్గిన క్రైమ్ రేట్

204
rachakonda
- Advertisement -

గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది 12 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని తెలిపారు రాచకొండ పోలీసులు వెల్లడించారు. దోపిడీలు, దొంగతనాలు కేసుల్లో 53 శాతం రికవరీ అయ్యాయని…. మహిళలపై వేధింపులు కేసులు 11 శాతం పెరిగిందన్నారు.

ఈ ఏడాది రాచకొండ పరిధిలో 11 892 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డయల్‌ 100 కి 1,66,181 ఫిర్యాదులు వచ్చాయని…డయల్‌ 100కు వచ్చిన ఫిర్యాదులు ద్వారా 41 మందిని కాపాడమని పేర్కొన్నారు. ఈ ఏడాది గుర్తు తెలియని 89 మృతదేహాలు గుర్తించమన్నారు.

స్పెషల్ ఆపరేషన్ టీమ్ చెందిన కేసులు 892 అని… 5 కోట్ల 95 లక్షల ఆస్తి రీకవరి కేసులు ఛేదించామన్నారు. ఇక మిస్సింగ్ కేసుల్లో ఈ ఏడాది 2,525 కేసులు నమోదు కాగా… 2233 కేసులు ఛేదించామని పేర్కొన్నారు.

- Advertisement -