ప్రిక్వార్టర్‌లో పీవీ సింధు..

195
sindhu
- Advertisement -

టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటుతోంది పీవీ సింధు. గ్రూప్ జే రెండో మ్యాచ్‌లో విజయం సాధించి ప్రిక్వార్టర్‌లో అడుగుపెట్టింది తెలుగుతేజం, భారత ఏస్ ష‌ట్లర్ పీవీ సింధు. హాంకాంగ్‌కు చెందిన ఎన్‌గ‌న్ యితో తలపడిన సింధు 21-9, 21-16 తేడాతో వ‌రుస గేమ్స్‌లో గెలిపొందారు.

తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే ముగించినా సింధుకు రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘ‌ట‌న తప్పలేదు. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో మెల్లగా పుంజుకున్న సింధు.. వ‌రుస‌గా పాయింట్లు సాధిస్తూ విజయానికి చేరువైంది.ఈ విజయంతో గ్రూప్ జే టాప‌ర్‌గా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది పీవీ సింధు.

- Advertisement -