పీవీ నరసింహరావు సేవలు మరువలేనివిఃమంత్రి హరీశ్ రావు

154
Harish Rao Review
- Advertisement -

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివి అన్నారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ,JC పద్మాకర్ లు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పీవీ నరసింహరావు జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. పీవీ నరసింహరావు తెలంగాన బిడ్డ కావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. పీవీ నరసింహారావు పేరు చిరస్ధాయిగా నిలిచి ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించినట్లు తెలిపారు.

- Advertisement -