భారతజాతి ఆణిముత్యం పీవీ నరసింహారావుః మాజీ ఎంపీ కవిత

203
kavitha
- Advertisement -

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భారతజాతీ ఆణిముత్యం అన్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. నేడు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన తెలంగాణ బిడ్డ, భారతజాతి ఆణిముత్యం, బహుభాషా కోవిధుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అన్నారు.

వారి శతజయంతిని పురస్కరించుకుని జాతి యావత్తు గర్వించేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించడం ఎంతో సంతోషిచదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.

- Advertisement -