మొక్కలు నాటిన దర్శకుడు వివి.వినాయక్, నటీ పూనమ్ కౌర్

172
poonam kour
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి విశేషమైన స్పందన వస్తుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు దర్శకుడు వివి. వినాయక్, నటీ పూనమ్ కౌర్. మనం సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీ లో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రీన్ ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతామన్నారు. ఈ ఛాలెంజ్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మనం సైతం ఫౌండర్ కాదంబరి కిరణ్ పాల్గోన్నారు.

- Advertisement -